Current Date: 04 Jul, 2024

7వ సారి ఎంఎల్ఎ గా అయ్యన్నపాత్రుడు ప్రమాణస్వీకారం

 నర్సీపట్నం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు శాసన సభ్యుదుగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేశారు. 7వ సారి ఎంఎల్ఎ గా గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యుడుగా అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  1983 నుంచి 2024వ సంవత్సరం వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ తరఫున, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తూనే ఉన్నారు. ఇటీవల క్యాబినెట్ లో అయ్యన్నపాత్రుడుకు మంత్రి పదవి వస్తుందని నర్సీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు ఆశించారు. అయితే మంత్రి పదవి రాలేదు. సీనియర్ శాసనసభ్యుడు కావడం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగటం, అయ్యన్నపాత్రుడు ప్రత్యేకత.

 

Share