Current Date: 05 Oct, 2024

ఎంఎల్సిలుగా సి.రామచంద్రయ్య,పి.హరిప్రసాద్ లు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎంఎల్సిలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి.రామచంద్రయ్య,జనసేన పార్టీ తరపున పి.హరి ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎంఎల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు శుక్రవారం అసెంబ్లీ భవనంలో ప్రకటించారు.ఎంఎల్ఏల కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎంఎల్సి స్థానాల భర్తీకి నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగియడంతో కేవలం ఇద్దరు అభ్యర్ధులు అనగా సి.రామచంద్రయ్య,పి.హరిప్రసాద్ లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఇద్దరు అభ్యుర్దులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి విజయ రాజు ప్రకటించారు.ఈకార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి పాల్గొన్నారు. 

Share