Current Date: 03 Oct, 2024

విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల పడిగాపులు

భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దవడం, రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల పట్టాలపైకి వరదనీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విజయవాడతో పాటు రాయనపాడు రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు రైల్వే అధికారులు స్టేషన్‌లో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. మరోవైపు రైల్వే సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. విజయవాడ డివిజన్‌ వ్యాప్తంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు రైళ్లను రద్దును పొడిగించే అవకాశముంది. 

Share