Current Date: 08 Oct, 2024

పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయన పవన్ పై కంప్లైంట్ ఇచ్చారు. ఇటీవల లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు పాల్. అంతేకాదు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం పదవికి అనర్హుడని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని   కేఏ పాల్ డిమాండ్ చేశారు. పవన్ ను అరెస్ట్ చేసి విచారణ చేయాలి. చట్టం ముందు అంతా సమానమే. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా… చట్టానికి కట్టుబడి ఉండాలని,తక్షణమే పవన్ కల్యాణ్ నోరు మూయించాలి. పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏవేవో మాట్లాడుతున్నారు. అవన్నీ రాంగ్. సినిమాలో మాదిరి నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది చదివేస్తున్నావు. అది చట్ట విరుద్ధమని పాల్ పేర్కొన్నారు.

Share