Current Date: 25 Sep, 2024

చిత్తూరులో పెళ్లి అయిన 5 రోజులకే వరుడు మృతి.. అత్తగారింటికి వచ్చిన రోజే

కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. ఏడు అడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన ఐదు రోజులకే వరుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని వెంగసంద్రాకు చెందిన 28 ఏళ్ల కార్తీక్‌తో రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవాని అనే యువతికి ఐదు రోజుల కిందట పెళ్లి జరిగింది. 5వ రోజు కార్తీక్ అత్తగారింటికి వచ్చాడు. అయితే ఉదయం ఒంట్లో నలతగా ఉందంటూ భార్యను తీసుకుని ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు.ఎన్నో కోరికలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువుకు తీరని కష్టం వచ్చింది. గుండెల మీద కొత్తగా పడిన తాళి గుండె కోతను మిగిల్చింది. వధువుతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు పెట్టిన తీరు అందర్నీ కలచివేసింది.

Share