Current Date: 23 Sep, 2024

శ్రీవారి లడ్డు కల్తీపై ప్రధానికి సుదీర్ఘ లేఖ రాసిన వైయస్ జగన్

శ్రీవారి లడ్డు వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. నిజాల్ని నిగ్గు తేల్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఈ లేఖలో వైఎస్ జగన్ ఆరోపించారు.తిరుమల వెంకన్నకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారన్న వైఎస్ జగన్.. ఇలాంటి చర్యలతో దేవస్థానం ప్రతిష్టకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ సున్నితమైన అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. లేకపోతే దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ప్రధానికి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని వైఎస్ జగన్ లేఖలో ఆరోపించారు. తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబును మందలించడంతో పాటుగా ఈ వ్యవహారంలో అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైఎస్ జగన్ కోరారు

Share