Current Date: 03 Oct, 2024

దసరా ముంగిట ఏపీ క్యాబినెట్ భేటీ..రెండు పథకాలకి గ్రీన్ సిగ్నల్?

 ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల పదో తేదీన భేటీ కానున్నట్లు తెలిసింది. సచివాలయం వేదికగా అక్టోబర్ 10న ఏపీ కేబినెట్ భేటీ జరగనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.దసరా పండుగకు కేవలం రెండు రోజుల ముందు ఏపీ మంత్రివర్గ భేటీ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టులు అయిన పోలవరం నిర్మాణం, అమరావతి రాజధానిపైనా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటుగా దసరా కానుకగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

Share