Current Date: 05 Oct, 2024

ఫైల్స్‌ దహనం కేసు సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం చేసిన ఘటనలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.  మూడు రోజులుగా రెవెన్యూ, పోలీసు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కుట్రధారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  బుధవారం ఉదయం అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ వెంకటరమణ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.   అగ్ని ప్రమాదం జరిగితే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో సీఐను వీఆర్‌కు పంపారు. ఆయనతో పాటు నైట్‌ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు హరిప్రసాద్‌, భాస్కర్‌ను సస్పెండ్‌ చేశారు.  

Share