Current Date: 04 Jul, 2024

జగనన్న చెప్పినా నమ్మరే..?

ఈ ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామని ఐ ప్యాక్ సమావేశంలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్  వెల్లడించిన విషయం తెలిసిందే.గతంలో వచ్చిన 151 కంటే ఒక్క సీటైనా ఎక్కవే వస్తుందని విశాఖలో పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాధ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.‘  175 కి 175 సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం అని  మరో వైసీపీ అగ్ర నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.. జూన్ తొమ్మిదవ తేదీన విశాఖలోనే ముఖ్యమంత్రిగా జగన్ రెండోసారి ప్రమాణం చేస్తారు. అని తేదీ కూడా ఫిక్స్ చేసేసారు . సమయం, వేదిక త్వరలో చెబుతాం’ అని బొత్స సత్యనారాయణ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పారు.
అయినా  వైసీపీ అభిమానులకు,  బెట్టింగ్ బాబులకు నమ్మకం కుదిరినట్టు లేదు.
ముఖ్యంమంత్రి నుంచి మంత్రులు వరకూ వైసీపీ ముఖ్యనేతలు అఖండ విజయంపై ప్రకటనలు చేస్తూనే వున్నా నేతలు, కార్యకర్తలకు మాత్రం నమ్మకం కుదురడం లేదు. ఫలితాలపై పందేలు కాసేవారు తమ నాయకుల మాటల్ని అస్సలు నమ్మడం లేదు. ఢాంకా బాది గెలుస్తామని వీరు చేస్తున్న ప్రకటనలను  బెట్టింగ్ మార్కెట్ అస్సలు నమ్మడం లేదు సరికదా అపనమ్మకంతో వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్యను రోజు రోజుకూ తగ్గిస్తోంది.
ఆన్ లైన్ బెట్టింగ్ మార్కెట్ ఫిగర్ 65-68 
వైసీపీ కి వచ్చే సీట్ల సంఖ్య 65- 68 కి పడిపోయిందనే వీళ్ళు చెబుతున్నారు.. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఆన్ లైన్ సైట్ లో రోజు రోజుకూ వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గిపోతోంది.పోలింగ్ కు ముందు ఇది 80 దగ్గర ఉండేది.. పోలింగ్ రోజు 75 వద్ద వున్న వైసీపీ కి వచ్చే సీట్ల సంఖ్య ఆ తరువాత 70 కి తగ్గిపోయింది.. జగన్ ఐ ప్యాక్ సమావేశంలో 160 అన్న తరువాత ఆ సంఖ్య విచిత్రంగా 65-68  కి పడిపొయింది. వైసీపీ 70 సీట్ల మార్కు దాటదంటూ పెద్ద సంఖ్యలో  ఏకపక్షంగా పందేలు కాయడంతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు దానిని 65 కు తగ్గించారు. వైసీపీకి ఎంపీ సీట్లు తొమ్మిది వస్తాయన్న దానిపైన పందేలు జరుగుతున్నాయి.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య  మధ్య వుంది. టీడీపీ కి 94 కి పైగా  సీట్లు వస్తాయని అదే సైట్ లో పందేలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజు  88-90 మధ్య వున్న ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతోంది . కూటమితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సింగిల్ గా వచ్చే సీట్ల సంఖ్య ఇది.
భీమవరం పందేలు 1:2
ఇక వేల కోట్ల పందేలు జరిగే భీమవరంలో వైసీపీ విజయావకాశాలపై 1:2 నిష్పత్తిలో పందేలు జరుగుతున్నాయి. వీటికి కూడా పెద్దగా ముందుకు రావడంలేదని తెలిసింది. అంటే వైసీపీ గెలిస్తే లక్షకు రెండు లక్షలు ఇస్తారు. కూటమి గెలిస్తే లక్షకు లక్ష ఇస్తే చాలు .  వైసీపీ అధికారం లోకి వస్తుందన్న వాదాన్ని బెట్టింగ్ బాబులు విశ్వశించడం లేనట్టు కనిపిస్తోంది. అయితే ఏమి జరగ నుందో జూన్ 4 వరకూ ఎదురు చూడాల్సిందే.