Current Date: 05 Oct, 2024

రూ. 3 కోట్ల విలువైన గౌతమి భూమి కబ్జాన్యాయం జరిగే వరకు పోరాడతానన్న సినీ నటి

ఓ భూ వ్యవహారంలో దారుణంగా మోసపోయిన సీనియర్ నటి గౌతమి తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. తమిళనాడులోని కారైక్కుడికి చెందిన అళగప్పన్  రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి ఉన్న స్థలాన్ని కబ్జా చేసి, ఆపై నకిలీ పత్రాలు సృష్టించి వేరే వ్యక్తులకు విక్రయించాడు. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని తన ప్రమేయం లేకుండా విక్రయించడంపై గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువులపై కేసులు పెట్టారు. ఏడాదిగా వారంతా బెయిలుపై ఉన్నారు

Share