Current Date: 06 Jul, 2024

ఏపీ సీఎం జగన్ పై దాడి... నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ 27 కి వాయిదా...

సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్  బెయిల్ పిటిషన్ పై  ఇవాళ  విజయవాడ  కోర్టులో  విచారణ జరిగింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం  కావాలని నిందితుడి తరపు లాయర్  న్యాయమూర్తిని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 27 కు  వాయిదా వేశారు.