Current Date: 21 Sep, 2024

డోర్‌పై పాస్ పోసినందుకు రూ.25 వేలు జరిమానా.. రూల్స్ అలా!

సింగపూర్‌లో భారతీయుడు మద్యం మత్తులో స్టార్‌ హోటల్‌ ఎంట్రన్స్ డోర్‌పై పాస్ పోశాడు. దాంతో సీరియస్‌గా తీసుకున్న హోటల్ యాజమాన్యం అతడ్ని పట్టుకుని పోలీసులకి అప్పగించింది. కోర్టు అతనికి జరిమానా కూడా విధించింది. వర్క్‌ పర్మిట్‌తో సింగపూర్‌లో ఉంటున్న రాము అనే వ్యక్తి.. క్యాసినో ఆడేందుకు ప్రముఖ రిసార్ట్స్‌ అండ్‌ హోటల్‌కు వెళ్లాడు. అప్పటికే మద్యం తాగాడు. కొద్దిసేపు గ్యాంబ్లింగ్‌ ఆడిన అతడు.. బాత్‌రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు.కానీ మద్యం మత్తులో అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం కష్టమైంది. దాంతో ఎంట్రెన్స్‌ వద్ద ఫ్లోర్‌ మీదే విసర్జించాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది.. సీసీటీవీల్లో అతడిని గుర్తించి ప్రజారోగ్య నిబంధనల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.గతేడాది అక్టోబర్‌ 30న చోటుచేసుకోగా.. దాదాపు 8 నెలల తర్వాత జూన్‌ 4న క్యాసినో కోసం రాము మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. వెంటనే గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

Share