Current Date: 10 Oct, 2024

టీ20లో భారత్‌ని ఒంటిచేత్తో గెలిపించిన వైజాగ్ క్రికెటర్

బంగ్లాదేశ్‌ బౌలర్లని రెండో టీ20లో విశాఖపట్నంకి చెందిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి దంచేశాడు. ఇటీవల భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన నితీశ్ 34 బంతులే ఆడినా అందులో 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తం మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి భారత్ జట్టుకి 221 పరుగుల భారీ స్కోరుని అందించాడు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ టీమ్ 135 పరుగులకే పరిమితమైంది. బ్యాటింగ్‌లోనే కాదు నితీశ్ రెడ్డి బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. 4 ఓవర్లు వేసిన  వైజాగ్ కుర్రాడు 23 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్‌లోనే గెలిపించే ప్రదర్శన చేసి అవార్డుని తీసుకోవడం విశేషం. ఇక ఆఖరి టీ20 మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లో జరగనుంది.

Share