Current Date: 06 Jul, 2024

జగన్ కేసు ఈ నెల 20 కి వాయిదా

సీబీఐ విచారణ జరుపుతున్న  జగన్ కేసు రేపటికి వాయిదా పడింది. నాంపల్లి లోని సీబీఐ స్పెషల్ కోర్ట్ లో జగన్ కేసు ఈ రోజు నుంచీ విచారణ జరగాల్సి వుంది. కానీ జడ్జి సెలవులో ఉన్నందువల్ల కేసును గురువారానికి వాయిదా వేశారు. మోత్తం 11 ఛార్జ్ షీట్ల లో 130 మంది నిందితులు డిశ్చార్జ్ పిటిషన్ లు వేశారు. గతం లో పనిచేసిన జడ్జి వీరి వాదనలు విన్నారు గానీ ఎటువంటి ఉత్తరువులూ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త జడ్జి ముందు మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ లపై వాదనలు జరగాల్సి వుంది. ఇదిలా వుంటే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక తను ప్రతి వారం కోర్ట్ కు హాజరు కానవసరం లేకుండా హైకోర్టు నుంచి వెసులుబాటు పొందిన విషయం తెలిసిందే. ఈ వెసులు బాటును హైకోర్టు కొనసాగిస్తుందా? లేదా అన్నది చూడాల్సి వుంది.

Share