Current Date: 05 Oct, 2024

తిరుమల శ్రీవారికి విరాళంగా 16 ద్విచక్ర వాహనాలు

 చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ఎండీ  వేణు సుదర్శన్ శుక్రవారం తిరుమల శ్రీవారికి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు. అంతకు ముందు తిరుమల శ్రీవారి అలయం వద్ద ఈ వాహనాలకు పూజలు నిర్వహించారు. అనంతరం దాత ఈ వాహనాల తాళాలను తితిదే అధికారులకు అందజేశారు. వీటిలో  15 ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర సుమారు రూ.22 లక్షలు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో జె.శ్యామలరావు,  అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, డీఐ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share