Current Date: 02 Apr, 2025

మయన్మార్‌లో మరో భూకంపం.. 150కి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌ను తాజాగా మరో భూకంపం భయపెట్టింది. శుక్రవారం పొద్దుపోయాక సంభవించిన ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. అంతకుముందు 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఆగ్నేయాసియాను కుదిపేసింది. దీని కారణంగా ఇప్పటి వరకు 150 మంది ప్రాణాలు కోల్పోగా, వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మయన్మార్, థాయిలాండ్‌లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్యాంకాక్‌లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 9 మంది గాయపడ్డారు. భూకంపం ధాటికి నిర్మాణంలో ఉన్న హైరైజ్ భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికిపైగా గల్లంతయ్యారు. తొలి భూకంపం ధాటికి మయన్మార్‌లో 144 మంది చనిపోగా 732 మంది గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య 1000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Share