Current Date: 04 Jul, 2024

టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన ఒకటో తరగతి బుడ్డోడు!

రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బుడ్డోడు షాకిచ్చాడు. పిల్లోడి మాటలకు ఎమ్మెల్యే సహా అక్కడున్నవారంతా పగలబడి నవ్వేశారు.ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరంలోని ఓ స్కూల్‌కు వెళ్లారు. అక్కడ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు వరుసగా వచ్చి బుక్స్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకటో తరగతి చదువుతున్న ఓ బుడ్డోడు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి‘ మొన్న సైకిల్‌కి ఓట్లు వేశారు నీకే కదా’’ అని సరదాగా అడిగాడు. దాంతో ఆ  ప్రశ్నకి ఎమ్మెల్యే పగలబడి నవ్వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్ కి ఓట్లు వేశారు నీకే కదా అని బోల్డ్‌గా అడగడం చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. రాజకీయాలపై పెద్దలే కాదు.. పిల్లలు కూడా ఆసక్తిగా ఉన్నారంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

Share