Current Date: 05 Oct, 2024

ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్‌ఐ

ఏసీబీ వలకు ఓ మహిళా ఎస్‌ఐ  చిక్కారు. మోసం కేసులో రిమాండ్‌కు తరలించకుండా ఉండేందుకు రూ.10వేలు లంచం తీసుకున్న విశాఖలోని మల్కాపురం ఉమెన్‌ ఎస్‌ఐ జి. దేముడమ్మను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం ఎస్‌ఐ దేముడమ్మ స్టేషన్‌లోనే ఉండగా బాధితులు సొమ్ము అందజేస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మల్కాపురం సీఐ విద్యాసాగర్‌ది నైట్‌ డ్యూటీ కావడంతో స్టేషన్‌ విధుల్లో మహిళా ఎస్‌ఐ దేముడమ్మ ఉన్నారు. వాస్తవానికి ఈ కేసులో ఉమెన్‌ ఎస్‌ఐ రూ.50వేలు లంచం డిమాండ్‌ చేయగా, అడ్వాన్సుగా శనివారం రూ.10వేలు అందుకున్నారని తెలిసింది.

Share