Current Date: 02 Oct, 2024

శ్రీవారిని దర్శించుకున్న పవన్‌.. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌   తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో పవన్‌ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు దీన్ని కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన.. అలిపిరి మెట్లమార్గం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు.

Share