Current Date: 05 Oct, 2024

త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు: కేంద్రమంత్రి

ఏపీ ప్రజలకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుభవార్త చెప్పారు. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. భూకేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని తెలిపారు. అతి త్వరలో జోన్ కేంద్రకార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Share