Current Date: 05 Oct, 2024

కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్‌ ఎమోషనల్ ట్వీట్

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రాఖీ పండగ సందడి కొనసాగింది.
సామాన్యుల నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వారి వరకు అంతా ఉత్సాహంగా రాఖీ పండగను జరుపుకున్నారు.రక్షా బంధన్ సందర్భంగా కవితను తలుచుకుంటూ కేటీఆర్‌ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ కష్టసుఖాల్లో నీకు నేను తోడుగా ఉంటాను కవిత అని ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు పెట్టారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుకున్న ఆమె బెయిల్ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత రాఖీలు కట్టారు.

Share