Current Date: 06 Oct, 2024

ఈ వాలంటీర్లఫ్యూచర్ ఏంటో ?

అసెంబ్లీ ఎన్నికల వేళలో నాటి అధికార వైసీపీకి అనుకూలంగా పని చేసేందుకు వీలుగా లక్షకు పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయటం తెలిసిందే. వారి అంచనాలకు భిన్నంగా ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలు కావటం.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావటంతో ఇప్పుడు సదరు వాలంటీర్లు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమను మళ్లీ విధుల్లో చేర్చుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఏపీలోని వివిధ జిల్లాల్లో అలాంటి పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు తమను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని.. అందుకే తమ పదవులకు రాజీనామా చేసినట్లుగా వారు వాపోతున్నారు. తాము మోసపోయినట్లుగా వాపోతున్న వాలంటీర్లలో అత్యధికం మహిళలు ఉండటం గమనార్హం. ఏపీలోని విశాఖపట్నం, ఏలూరు, ప్రకావం.. అనంతపురం, కర్నూలు, క్రిష్ణా జిల్లాలకు చెందిన వాలంటీర్లు పలువురు ఎమ్మెల్యేలను కలిసి తమ ఆవేదనను పంచుకుంటున్నారు. 

Share