Current Date: 06 Oct, 2024

మావయ్యకు ప్రేమతో...

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసైనికుల్లో  ఆనందం అవధులు లేకుండా మారింది. ఇక హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా గురువుగా భావించే తన మావయ్య ఓ బహుమతి అందించారు. ఆ ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.  నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిప్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశారు తేజ్‌. ఆ గిఫ్ట్‌ ధర దాదాపు రూ. 1,30,000 ఉంటుందని అంచనా.

Share