Current Date: 04 Jul, 2024

హైదరాబాద్ ఓడినా ఒక్క మాటతో అందరి మనసులు గెలిచిన ఓనర్ కావ్య మారన్!

పీఎల్ 2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్  టీమ్ ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. మే 26న చెన్నైలోని ఎంఏ. చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. ఇది ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఫైనల్‌ల్లో అత్యల్ప స్కోర్‌. లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన కేకేఆర్ మూడో ఐపీఎల్ టైటిల్ ను త‌న ఖాతాలో వేసుకుంది. అయితే, ఫైన‌ల్ లో ఓట‌మిని హైద‌రాబాద్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఓడిన‌ప్ప‌టికీ ఐపీఎల్ 2024 లో స‌న్ రైజ‌ర్స్ ఫైన‌ల్ వ‌ర‌కు సాగిన‌ గొప్ప ప్ర‌యాణంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారుహైదరాబాద్ యజమాని కావ్య మారన్ త‌న టీమ్ తో  డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఫైన‌ల్లో ఓడిన‌ప్ప‌టికీ వారి జ‌ట్టు నిరాశ‌ను పోగొట్ట‌డానికీ ప్ర‌య‌త్నించారు. మ్యాచ్ ఓట‌మి క్ర‌మంలో గ్రౌండ్ లో కావ్య తన టీమ్‌తో పాటు కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ఆ త‌ర్వాత త‌న టీమ్ తో మాట్లాడింది. క్ష‌ణాలు నిజంగా గొప్ప‌వి. కావ్య మాట్లాడుతున్న వీడియోను ఎస్ఆర్హెచ్ త‌న అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. త‌న టీమ్ కు పూర్తిగా మ‌ద్ద‌తు తెల‌ప‌డం అందులో క‌నిపించింది. "మీరందరూ మమ్మల్ని చాలా గర్వించేలా చేసారు. నేను ఇక్కడికి వచ్చి మీకు ఇదే చెప్పాల‌నుకున్నాను. ఇప్పుడు అందరూ మన‌ గురించి మాట్లాడుతున్నారు” అని కావ్య చెప్పింది. కావ్య తన ప్రసంగాన్ని ముగించే ముందు జట్టు సభ్యులు ముఖాలపై చిరునవ్వును నింపింది.