Current Date: 05 Oct, 2024

స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో గత రాత్రి ఆయన విజయవాడ వెళ్లే క్రమంలో తుని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్‌లో ఆయన సాధారణ ప్రయాణికుడిలా ప్లాట్ ఫామ్‌పై కూర్చున్నారు. ఆ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెంట పోలీసులు, గన్‌మెన్లు సైతం ఎవరు లేరు. దీంతో అయ్యన్న పాత్రుడు సింప్లిసిటీ చూసి ప్లాట్‌పామ్‌పై సహచర ప్రయాణికులు సైతం నివ్వెరపోయారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.  

Share