Current Date: 06 Oct, 2024

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా, ఇదే ధర్మాసనం మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Share