Current Date: 05 Oct, 2024

గవర్నర్ దృష్టికి అధికార పార్టీ అరాచకాలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం గవర్నర్‌  అబ్దుల్‌నజీర్‌తో భేటీ కానున్నారు.  సాయంత్రం 5 గంటలకు పార్టీ నాయకులతో కలిసి రాజ్‌భవన్‌ వెళతారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను  జగన్‌  గవర్నర్‌కు వివరిస్తారు. వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మరునాడే పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్‌కు అందజేస్తారు.

Share