Current Date: 25 Sep, 2024

యూట్యూబ్ సెన్షేషన్ హర్ష సాయిపై కేసు నమోదు నెటిజన్లు షాక్

యూట్యూబర్ హర్ష సాయిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‪‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.పేదలకు డబ్బు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసే హర్ష సాయి చాలా పాపులర్ అయ్యాడు. అయితే బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడని కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయి బండారం కాస్త బట్టబయలైంది.గత కొన్నేళ్లుగా హర్ష సాయికి యూత్‌లో చాలా క్రేజ్ వచ్చింది. అతను సినిమా కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. అది ఏ దశలో ఉందో తెలియదు. కానీ.. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల జానీ మాస్టర్‌పై కూడా జూనియర్ కొరియోగ్రాఫ్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

Share