Current Date: 27 Sep, 2024

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆహ్వానం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకూ వైభవంగా జరగనున్నాయి. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ కు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Share