Current Date: 05 Oct, 2024

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన రేవంత్

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. పతాక ఆవిష్కరణ తర్వాత జాతీయ గీతం జనగనమన ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ పాట ప్లే చేశారు. సాయుధ బలగాల గౌరవ వందనం తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Share