Current Date: 05 Oct, 2024

హైకోర్టును ఆశ్రయించిన దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు నోటీసులు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ హైకోర్టుకు చేరింది. దువ్వాడ కుటుంబ పంచాయతీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్ గా మారింది. ఓ పక్క శ్రీనివాస్ భార్య వాణి న్యాయపోరాట దీక్ష కొనసాగిస్తుండగా, శ్రీనివాస్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  భార్య వాణి, కుమార్తె హైందవి ఇంటిపైకి వచ్చి వివాదం చేస్తున్నారని, వారిపై నమోదు చేసిన కేసులో టెక్కలి పోలీసులు దర్యాప్తు చేయడం లేదని కోర్టుకు విన్నవిస్తూ  బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ కోరాడు. ఈ పిటిషన్ పై  విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Share