Current Date: 04 Jul, 2024

నిమిషానికి కోటి రూపాయల్ని వసూలు చేస్తున్న హీరోయిన్!

క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు దండుకోవాలనేది ఇండస్ట్రీ సూత్రం. హీరోయిన్లకు స్టార్ డం వచ్చిందంటే సంపాదన అమాంతం పెరుగుతుంది. దక్షిణాదిలో నయనతార ఎక్కువ పారితోషికం తీసుకుంటోంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా నిముషానికి కోటిరూపాయలు తీసుకుంటోంది. ఆమె ఎవరంటే ఊర్వశి రౌతేలా.

ఒక్కో స్టార్ హీరోయిన్ కు పాపులారిటీ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. ఊర్వతి మాత్రం అందరికంటే విభిన్నంగా ఉంటుంది. చేసేది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం హీరోయిన్ల రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ లో అందరూ ఆమె కోసం ఎదురుచూస్తుంటారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఈజ్ ద పార్టీ అంటూ చిరంజీవితో ఆడిపాడింది ఊర్వశి రౌతేలా. ఆ సినిమాలోని పాటలో కనిపించేందుకు రెండు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు పరిశ్రమలో డిమాండ్ బాగా పెరిగింది. బాలీవుడ్ కన్నా టాలీవుడ్ లోనే తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది.