Current Date: 05 Oct, 2024

విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హవా

విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టిడిపి కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. పదికి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీకి చెందిన కార్పొరేట ర్లు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఫలితాల్లో 10 స్థానా లను టీడీపీ దక్కించుకోగా.. జీవీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. 10 స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు హంగామా చేశారు. అంతకు ముందు కౌంటింగ్‌పై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్‌ పై పెన్సిల్‌తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. 

Share