Current Date: 04 Jul, 2024

విడాకుల గొడవలో.. విదేశాలకి భారత క్రికెటర్!

భార్య నటాషాతో విడాకుల రూమర్స్​ మధ్య టీమిండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా మళ్లీ వార్తల్లో నిలిచాడు. మరోవైపు.. 2024 టీ20 వరల్డ్​ కప్​ కోసం వెళ్లిన టీమిండియా జట్టులో అతను చేరలేదు. మరి హార్దిక్​ పాండ్య ఎక్కడ ఉన్నడు? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.హార్దిక్​ పాండ్యకు 2024 కలిసి రావడం లేదు! ముంబై ఇండియన్​ కెప్టెన్​గా, ప్లేయర్​గా ఐపీఎల్​ 2024లో ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్​ శర్మ నుంచి పగ్గాలు తీసుకున్న పాండ్యపై ఫ్యాన్స్​ అసంతృప్తితో ఎగతాళి చేశారు. వీటన్నింటి మధ్య.. ముంబై ఇండియన్స్​ లీగ్​ స్టేజ్​లోనే బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాతే.. హార్దిక్​ పాండ్య వ్యక్తిగత జీవితంపై ఫోకస్​ పెరిగింది. భార్య నటాషా.. తన ఇన్​స్టాగ్రామ్​లో హార్దిక్​ పాండ్య ఫొటోలను తొలగించింది. ఇద్దరు విడాకులు తీసుకోవడం దాదాపు ఖాయం అని, భరణం కింద.. నటాషాకు పాండ్య ఆస్తిలో 70శాతం లభిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి.ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్​ కప్​ కోసం టీమిండియా జట్టు సభ్యుల్లో చాలా మంది న్యూయార్క్​ చేరుకున్నారు. సంజూ సమ్​సన్​, యశస్వీ జైస్వల్​, చాహల్​, ఆవేశ్​ ఖాన్​త విరాట్​ కోహ్లీ, హార్దిక్​ పాండ్యలు మాత్రం ఇంకా వెళ్లలేదు. వ్యక్తిగత కారణాల వల్ల బీసీసీఐ అనుమతి తీసుకుని, టీమ్​లో ఆలస్యంగా చేరుతున్నాడు విరాట్​ కోహ్లీ. ఇక భార్యతో విడాకుల రూమర్స్​ మధ్య.. హార్దిక్​ పాండ్య ఇంకా బయట కనిపించలేదు. ప్రస్తుతం.. విదేశాల్లో, ఎవరికి తెలియని ప్రదేశంలో వెకేషన్​లో ఉన్నట్టు తెలుస్తోంది.