Current Date: 06 Oct, 2024

ఎన్నికల బెట్టింగ్ లో అప్పుల పాలు డబ్బుకోసం భార్యను కడతేర్చిన భర్త

సార్వత్రిక ఎన్నికల్లో ఓ పార్టీ తరపున బెట్టింగ్ కాసి అప్పుల పాలై డబ్బుకోసం భార్యను హత్య చేసిన ఘటన కాకినాడ ఫిషింగ్ హార్బర్ పేటలో కలకలం రేపుతుంది. బెట్టింగ్ డబ్బు ఇవ్వమని బెట్టింగ్ రాయుళ్లు వేధించడంతో తన  భార్య అయిన ఒలేటి సీతను, భర్త నరసింహమూర్తి పుట్టింటి వారి నుంచి డబ్బు తెమ్మని హింసించగా అందుకు సీత నిరాకరించింది. అది తట్టుకోలేని భర్తసీత నిద్రలో ఉండగా ఈరోజు తెల్లారి జామున తలపై గట్టిగా కొట్టి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి నిందితుడు నరసింహమూర్తిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Share