Current Date: 04 Jul, 2024

వల్లభనేని వంశీ అమెరికాకి జంప్.. వెంటాడుతున్న భయం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ చేసే వ్యక్తుల్లో వల్లభనేని వంశీ ఒకరు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీ పంచన చేరారు. రాజకీయాల్లో ఇది కామన్. కానీ.. నారా భువనేశ్వరి క్యారెక్టర్ గురించి, నారా లోకేష్ పుట్టుక గురించి వంశీ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలోనూ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దాంతో.. నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు వంశీకి వార్నింగ్ ఇచ్చాడు.

మొన్న ఎన్నికలు ముగిసిన వెంటనే చెప్పా పెట్టకుండా వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయారు. దీంతో 2024 ఎన్నికల్లో వంశీ ఓటమి ఖాయమని ఆయన అనుచరులే వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో వంశీ ఓడిపోతే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీ అమెరికా వెళ్లారన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిజానికి కొడుకు చదువుల కోసం అమెరికాలోని డల్లాస్‌‌కి వంశీ వెళ్లారని అనుచరులు చెబుతున్న మాట. కానీ.. టీడీపీ నాయకులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. వంశీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగా ఆయన అమెరికా వెళ్లారన్నది టీడీపీలో కొంతమంది నాయకుల వాదన. డల్లాస్‌లోని కొందరు ఎన్‌ఆర్‌ఐల ద్వారా టీడీపీ పెద్దలతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని.. అయితే అతనికి ఎవరూ సహకరించడం లేదని చెప్తున్నారు.