Current Date: 05 Oct, 2024

రాజ్‌తరుణ్‌, లావణ్య మధ్యలో దూరిన మస్తాన్ అరెస్ట్

హీరో రాజ్‌తరుణ్, లావణ్యల మధ్య జరిగిన ప్రేమ వివాదంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన సాయి మస్తాన్‌రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ కేసులో గుంటూరు నగరానికి చెందిన మస్తాన్‌రావును విజయవాడ సెబ్‌ పోలీసులుగుంటూరులో అరెస్టు చేశారు. సాయి డ్రగ్స్‌ సరఫరా చేస్తూ.. వినియోగిస్తున్నారు.  రెండు నెలల కిందట రైలులో డ్రగ్స్‌ తెస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్టుతో రావి సాయి వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి సాయి పరారీలో ఉన్నాడు. లావణ్యను హోటల్‌ గదిలో పెట్టి వేధించడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. అప్పట్లో కేవలం డ్రగ్స్‌ వినియోగదారుడు అని నోటీసులు ఇచ్చి వదిలేశారు. కానీ విచారణలో  గోవాలోని నైజీరియన్లతో లింకులు ఉన్నాయని, వారి సాయంతోనే డ్రగ్స్‌ తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Share