Current Date: 29 Sep, 2024

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ - సిట్‌ చీఫ్‌ సర్వశ్రేష్ఠ త్రిపాఠి

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్‌ చీఫ్‌ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు సిట్‌కు బదిలీ అయిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సిట్‌ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు ‘సిట్‌’ విచారణ సాగుతోంది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో మరోసారి సిట్‌ సభ్యులు భేటీ అయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టనున్నారు. డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్‌ బృందం పరిశీలిస్తోంది. టీడీపీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఈవో శ్యామలరావును వారు కలిసి వివరాలు తెలుసుకున్నారు.

Share