Current Date: 02 Jul, 2024

తిరుమల ఈడీపీ ఆఫీస్‌లో సడెన్‌గా మంటలు డేటా తగులబెట్టేందుకు యత్నించారా?

వైకుంఠం ఎదురుగా వున్న ఈడీపీ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెజర్ నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈడీపీ ఆఫీస్‌లోని తిరుమలకు సంబంధించిన డేటాని తగలబెట్టేందుకు మంటలు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ అలారం మోగడంతో పెను ప్రమాదం తప్పింది.

Share