Current Date: 06 Oct, 2024

టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. అంతకుముందు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమీ తీర్థప్రసాదాలు అందజేశారు.

Share