Current Date: 04 Jul, 2024

పిఠాపురానికి రామ్ చరణ్.. ఎమ్మెల్యే గారి తాలూకా!

మెగా హీరో రామ్ చరణ్ మరోసారి పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురానికి ఇటీవల చరణ్ వెళ్లి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు మళ్లీ పిఠాపురానికి అతను వెళ్లబోతున్నారు.శర్వానంద్ హీరోగా వస్తున్న 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 5న పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్‌కి జోడీగా కృతి శెట్టి నటించింది. ఈ ఈవెంట్‌కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం చరణ్‌ సమక్షంలో జనసైనికులు పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న జన సైనికులు.. రామ్ చరణ్‌కి కూడా ఆ ట్యాగ్‌ని తగిలించేసి వైరల్ చేస్తున్నారు. కానీ.. ఒకవేళ పొరపాటున పవన్ ఓడితే మాత్రం.. చరణ్ పర్యటన క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.