Current Date: 05 Oct, 2024

టీమిండియా అభిమానులకు ఓ న్యూస్ అప్పటి వరకు నో క్రికెట్

వరుస పెట్టి సిరీస్ లను ఆడటం టీమిండియాకు అలవాటు. ఒక సిరీస్ ముగిసిన వెంటనే మరో సిరీస్ ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. మహా అంటే ఒక వారం రోజుల పాటు మాత్రమే గ్యాప్ ఉంటుంది. అది కూడా ఏదైనా బిగ్ టోర్నీ ముగిసిన తర్వాతే. అయితే ఇప్పుడు టీమిండియాకు సుదీర్ఘమైన విరామం దొరికింది. టీమిండియా తన తదుపరి సిరీస్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. అది కూడా సెప్టెంబర్ నెలలో. అంటే దాదాపు నెల రోజుల పాటు టీమిండియా ప్లేయర్లకు విరామం దొరికింది. ఇలాంటి గ్యాప్ దొరకడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఈ విరామం తర్వాత బంగ్లాదేశ్ తో స్వదేశంలో రెండు టెస్టులు.. మూడు టి20లను ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టు 19 నుంచి 23 మధ్య జరగనుండగా.. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగుతుంది. అనంతరం మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లు అక్టోబర్ 6, 9, 12వ తేదీల్లో జరుగనున్నాయి. 

Share