Current Date: 05 Oct, 2024

అఖిలపక్ష సమావేశం నేడు

పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో నేటి ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఈ భేటీ జరుగుతుంది. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం, విశ్లేషణలతోపాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది.

Share