Current Date: 04 Jul, 2024

చెన్నైకి లక్నో చుక్కలు.. పనిచేయని ధోనీ మ్యాజిక్

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైంది. లక్నోతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 176 పరుగులు చేసినా 8 వికెట్ల తేడాతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసినా ఆ స్కోరు లక్నోకి సరిపోలేదు.

మ్యాచ్‌లో చెన్నై టీమ్ 200పైచిలుకు స్కోరు చేసే అవకాశం కనిపించింది. కానీ మిడిల్ ఓవర్లలో రవీంద్ర జడేజా బంతుల్ని వృథా చేసేశాడు. అతను 40 బంతులాడి చేసింది 57 పరుగులే. అతను కనీసం మరో 25-30 పరుగులు చేసి ఉన్నా చెన్నైదే గెలుపు అయ్యేది. లక్నో ఛేదనలో 134 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా చెన్నై తీయలేకపోయింది. షాడో కెప్టెన్‌గా ఉన్న ధోనీ ఎంత ప్రయత్నించినా వికెట్ మాత్రం దక్కలేదు. దాంతో చాలా ముందే చెన్నైకి ఓటమి ఖాయమైపోయింది.

ఏడో మ్యాచ్ ఆడిన చెన్నైకి ఇది మూడో ఓటమికాగా.. ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు లక్నో టీమ్ 4వ విజయంతో ఐదో స్థానానికి ఎగబాకింది