Current Date: 05 Oct, 2024

సీఎం సిద్ధరామయ్యను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సిద్ధరామయ్యను పవన్ సత్కరించారు. పవన్  ను సిద్ధరామయ్య అభినందించారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు ఊళ్లపైకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చింది. వీటిని అడవుల్లోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉండటంతో కొన్నింటిని ఏపీకి ఇప్పించాలని కోరేందుకు పవన్ బెంగళూరుకు వెళ్లారు.

Share