Current Date: 06 Jul, 2024

బాబు, పవన్‌కి డీఈ క్షమాపణలుఇది మరీ ఓవర్

కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ గవర్నమెంట్ అధికారితో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పించారు. అంతటితో ఆగకుండా ఆయనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేయించారు.కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డీఈ ఇంటి ముందు బుధవారం టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టడంతో రచ్చ మొదలైంది. పొరపాటున పోస్టులు పెట్టానంటూ సదరు డీఈ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలు విపక్షంలో ఉన్నప్పుడు సదరు డీఈ అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.పద్ధతి మార్చుకోవాలని గతంలో ఒకట్రెండుసార్లు చెప్పినా వినలేదంటున్నారు. అందుకే ఆయన ఇంటి వద్ద గాంధేయ పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపినట్లు చెప్పారు. అధికారులు ఎవరైనా ఇలాంటి పోస్టులు పెట్టి ఉంటే తొలగించాలని హెచ్చరించారు. లేకపోతే ఇదే పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు.

Share