Current Date: 05 Oct, 2024

స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

దివ్యాంగులపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. ఆ వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని. దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి చిట్‌చాట్‌ నిర్వహించారు.‘‘స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్‌ భావజాలం ఉంది. ఆమె తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఫిజికల్ ఫిట్‌నెస్‌ దేవుడు ఇచ్చేది. ఐఏఎస్, ఐపీఎస్‌ల పని వేరు. అనాధిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలి. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుంది. దివ్యాంగులుగా ఉన్న ఎంతోమంది గొప్ప స్థానాలకు వెళ్లారు. ఇతరుల సమర్థతను గుర్తించాలి. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లి ఉంటుంది. నేను కూడా తీసుకెళ్తాను’’ అని సీతక్క తెలిపారు

Share