Current Date: 02 Jul, 2024

వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ భేటీ...

వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. త్వరలోనే జరిగే శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కాగా.. ఓటమి అనంతరం జగన్ అయితే ఒక్క మీడియా సమావేశం మినహా బయటకు కనిపించింది లేదు. ఎంత సేపటికీ నాలుగ్గోడల మధ్యే ఉంటూ మీటింగ్‌ల మీద మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. త్వరలోనే శాసన సభతో పాటు మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీకి బలం ఎక్కువ కాబట్టి అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది.

Share