Current Date: 06 Oct, 2024

రాజధాని అభివృద్ది పనులను రెండున్నర్రేళ్లలో పూర్తిచేస్తాం రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

రాష్ట్ర రాజధాని అయిన అమరావతి అబివృద్ది పనులను రానున్న రెండున్నర్రేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.06 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.   ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యుత్తమమైన డిజైన్ ను రూపొందించి  అమలు పర్చడం జరిగిందన్నారు.

Share