Current Date: 02 Jul, 2024

విన్యాసాలు చేస్తుండగా వరదలు ఐదుగురు జవాన్ల గల్లంతు

చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం  విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యద్ధ ట్యాంక్‌లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్‌ మునిగిపోయింది. అందులో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టకుపోయినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడిరచారు. వీరిలో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు తెలిసింది.  వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share